మహేష్ అంటే లెక్కలేదా గురూజీ!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే ఈ సినిమా తరువాత మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంబంధించి ఓ స్టోరీలైన్‌ను కూడా రెడీ చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమాను జూన్ నెలలో ప్రారంభించాలని మహేష్ భావించాడు. కానీ ప్రస్తుత పరిస్థతులు చూస్తే.. ఇది సాధ్యం అయ్యేలా లేదు. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్టులు ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పవన్ నటించబోయే నెక్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చూసుకోవడంతోనే త్రివిక్రమ్ బిజీగా మారిపోయాడు.

దీంతో మహేష్ కోసం స్క్రిప్టును ఇంకా ఫైనల్ చేయకపోవడంతో మహేష్ బాబు త్రివిక్రమ్‌పై సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజం అయితే మహేష్ నేరుగా తన నెక్ట్స్ సినిమాను రాజమౌళితో ప్రారంభించాలని చూస్తున్నాడు. కానీ త్రివిక్రమ్ ఈలోగానే స్క్రిప్టును ఫైనల్ చేసి జూలైలో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.