సర్కారు వారి పాట ఫ్లాప్..ఆ హీరోకి ఎంత హ్యాపీ అంటే..ఫ్రెండ్స్ కు బిగ్ పార్టీ..?

టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు , మహానటి కీర్తి సురేష్ జంటగా కలిసి నటించిన చిత్రం..”సర్కారు వారి పాట”. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశూరామ్ తన దైన స్టైల్ లో ఈ సినిమా ను కూల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ..ఎట్టకేలకు నిన్న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా కమర్షీయల్ గా హిట్ టాక్ వచ్చినా..కానీ, చాలా మంది జనాలకు స్టోరీ ఎక్కలేదు. తనదికాని డబ్బు కోసం మహేశ్ ఇంత చేశాడా..సినిమాలో కీర్తి-మహేశ్ కామెడీ తప్పిస్తే ..పెద్దగా చెప్పుకోతగ్గ పాయింట్స్ లేవు అంటూ ఓ వర్గం ప్రజలు సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మహేశ్ ఫ్యాన్స్ VS మహేశ్ యాంటి ఫ్యాన్స్ బ్యాచ్ మాటలు హద్దులు దాటేస్తున్నాయి. అయితే, ఇలాంటి టైంలోనే మహేశ్ అభిమానులకు ఇంకా మండేలా ..ఓ న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇండస్ట్రీలో మహేశ్ అంటే పడని ఓ స్టార్ డైరెక్టర్..సర్కారు వారి పాట సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ..పిచ్చ హ్యాపీ గా ఉన్నారట. అంతేకాదు ఆయన జాన్ జిగిడి దోస్త్ అయిన హీరోతో కలిసి పార్టి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

నిజానికి ఆ డైరెక్టర్ కి మహేశ్ కి మంచి బాండింగ్ ఉండేదట. కానీ కొన్ని క్లాషస్ వల్ల అవి పెద్ద గొడవ గా మారి..కొన్నాళ్ల నుండి మాటలేవ్ అని..ఈ క్రమంలోనే మహేశ్ సినిమా దొబ్బింది అంటూ వార్తలు వినిపిస్తుండటంతో..ఆయన, తన హీరో ఫ్రెండ్ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఎంజాయ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండడంతో మహేశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా అంత బాగుంటే వీళ్లకి ఇదేం పోయేకాలం రా సామీ అంటూ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను పొగిడేస్తున్నారు.