తండ్రి, కొడుకుల‌తో రొమాన్స్ చేసిన క్రేజీ భామ‌లు వీళ్లే..!

వెండి తెరపై ఏదైనా సాధ్యమే. తల్లి ప్రియురాలు అయిపోతుంది. ప్రియురాలు చెల్లైపోతుంది. అలాగే ఓ సినిమాలో హీరో తండ్రితో నటించిన హీరోయిన్ వేరొక సినిమాలో ఆ తండ్రి తనయులతో కలిసి డ్యూయెట్లు పడేస్తుంది. అయితే ఇలాంటి కాంబినేషన్లను మనం అనాదినుండి చూడవచ్చు. అయితే అలా నటించే అవకాశం ఏ కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. అందరికీ ఆ అవకాశం రాదు. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లకే ఆ ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా ఫాదర్-సన్ తో కలిసి నటించిన కొంత మంది భామల గురించి ఇక్కడ ఓసారి చూద్దాము.

తండ్రీకొడుకులతో నటించిన భామలు వీరే :
ముఖ్యంగా ఇక్కడ కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, మరియు రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠీ గురించి మాట్లాడుకోవాలి. రకుల్ ప్రీత్ సింగ్ కింగ్ విషయానికొస్తే నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నటించడం మనకు తెలిసినదే. ఆ తర్వాత నాగార్జున సరసన ‘మన్మథుడు 2’లో జత కట్టింది ఈ ముద్దుగుమ్మ.

అలా ఈ అమ్మడు ఆ ఇద్దరితోను కలిసి రొమాన్స్ చేసింది. అలాగే క్రేజీ బ్యూటీ లావణ్య త్రిపాఠి నాగ చైతన్యతో ‘యుద్ధం శరణం’లో చేసింది. అలాగే నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’లో నర్తించింది. ఇక ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే రాబట్టింది.

తండ్రీ కొడుకుల కలయికలో మరికొంతమంది :
ఇక అందమైన ముద్దుగుమ్మ చందమామ కాజల్ అగర్వాల్ కూడా తండ్రి-తనయులతో తైతక్కలాడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘మగధీర’.. ‘నాయక్’ సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. వాటి తరువాత `ఖైదీ నెంబర్ 150`లో మెగాస్టార్ కి జోడీగా కనిపించింది. ఈ కోవలోనే మిల్కీ బ్యూటీ తమన్నాని కూడా చెప్పుకోవచ్చు.

చరణ్ ఓ కలిసి `రచ్చ`లో రచ్చ రచ్చ చేసిన అమ్మడు తరువాతికాలంలో చిరుతో ’సైరా నరసింహారెడ్డి’లో నటించింది. అలాగే చిరంజీవి తాజా చిత్రం `భోళా శంకర్`లో కూడా మరోసారి తమన్నాని తీసుకోవడం విశేషం. అలా అలాంటి కంబినేషన్లు అనేకం మనం చూడవచ్చును.