పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఇద్దరు హీరోలకు టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమా చేస్తే ఉంటదిరా.. అని అభిమానులు ఎన్నోసార్లు అనుకున్నారు కూడా. అయితే ఈ కాంబో మాత్రం ఇప్పటివరకు సెట్ కాలేదు. ఇక ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపించింది కూడా చాలా అరుదు.
అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపించేందుకు రెడీ అవుతున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ మే 7న నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అటు మహేష్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఈ ఇద్దరు హీరోలను ఒకే స్టేజీపై చూసేందుకు రెండు కళ్లు చాలవని వారు అప్పుడే అంటున్నారు. మరి నిజంగానే సర్కారు వారి పాట కోసం పవర్ స్టార్ కదిలి వస్తాడా లేడా అనేది చూడాలి.