స్టేజీ పై పూర్ణతో జబర్ధస్త్ కమెడియన్ వల్గర్ బీహేవియర్.. బూతులు తిడుతున్న జనాలు..?

జబర్ధస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. జనాలను నవ్వించడమే కాకుండా.. ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. తినడానికి అన్నం కూడా లేని వ్యక్తులకు..కారు, ఇళ్లు కొనుకునే అంతా స్దాయిని కలిపించింది. అంతే కాదు జబర్ధస్త్ షో లు కామెడీ తో నవ్వించే వాళ్లు పలు ఈవెంట్స్ లో కూడా పాల్గొంటుంటారు. అలా..శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో ని కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.

నిన్నటి వరకు ఆ షో కి గెస్ట్ గా చేసిన సుధీర్..ఈ వారం ఎపిసోడ్ లో మాత్రం మిస్ అయ్యాడు. మనకు తెలిసిందే సుధీర్ ఇప్పుడు హీరో గా కూడా సినిమాలు చేస్తున్నాడు . సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న కారణంతోనే ఆయన ఈ షోకి హోస్ట్ చేయలేక..ఆయన ప్లేస్ లో రష్మిని పంపిచిన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వారం కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రతి వారం లాగనే ఈ వారం కూడా ఓ సరి కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చారు టీం మెంబర్స్.

లేడీస్ VS లేడీ గెటప్స్..అంటూ ఓ ఫన్నీ ధీమ్ తో ఈ వారం ఎపిసోడ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో రాం ప్రసాద్ పంచులు, ఆది డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఓ ఎత్తు అయితే, వచ్చి రాని తెలుగులో రష్మీ స్పీచ్..టూ కామెడీ గా నవ్వించింది. అయితే, ఈ ఎపిసోడ్ లో లేడీ గెటప్స్ వేసే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ల ఫ్యామిలీ కష్టాల గురించి చెప్పిన మాటలు అందరి కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి. ఇక లాస్ట్ లో పూర్ణ స్టెజీ పై రష్మీతో మాట్లాడుతుండగా.. ఇమ్మానియేల్ ఆమె భుజం పై చెయ్యి వేస్తాడు. దీంతో పూర్ణ ఫైర్ అవుతూ..అతగాడి పై మండిపడుతుంది. అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న రష్మి స్పృహ కోల్పోతుంది..దీంతో ప్రోమోని ఎండ్ చేశారు మేకర్స్. దీని పై నెటిజన్స్ బూతులు తిడుతున్నారు. మీ TRP ప్లాన్స్ తెలిసినవే..ఇలా ఎన్ని సార్లు మమ్మల్ని మోసం చేస్తారు రా నాయన అంటూ తిట్టిపోస్తున్నారు. అస్సలు రష్మి ఎందుకు కళ్లు తిరిగి పడిపోయిందో తెలియాలంటే..ఆది వారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే…!