ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారా? త్వరలోనే ఆయన అం తరంగాన్ని వెల్లడించనున్నారా? అంటే… ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు. ప్రస్తుతం తన కేబినెట్ను జగన్ పూర్తిగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. మంత్రులందరితోనూ ఆయన రాజీనామా లు కూడా చేయించారు. ఈ నెల 11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం కూడా చేయించను న్నారు.
అయితే.. ఇది ముగియగానే.. మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని వైసీపీ సీనియర్ల మధ్య సాగుతున్న గుసుగుస జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడు అంత సంచలన నిర్ణయం ఏం ఉంటుంది? అంటే… ఉందనే చెబుతున్నారు. మంత్రి వర్గం మా ర్పు అయిపోయిన వెంటనే.. జగన్.. తన సలహాదారుల్లో సగం మందిని మార్చేసేందుకు రెడీ అవుతున్నా రని అంటున్నారు. ప్రస్తుతం 58 మంది సలహాదారులు ఉన్నారు. ఒక్క శ్రీరామచంద్రమూర్తి మాత్రమే.. చేయ లేనని రిజైన్ చేశారు.
అజేయ కల్లం సహా.. అనేక మంది కొనసాగుతున్నారు. నిజానికి వీరికి పెద్దగా పని లేదనే వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. పైగా.. ఎవరూ కూడా ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని పోస్టులను ఊరికే సృష్టించి.. అనవసరంగా.. కొనసాగించడం ఎందుకని.. జగన్ భావిస్తు న్నట్టు తెలుస్తోంది. అందుకే.. సగం మందిని పక్కన పెట్టడంతోపాటు.. మరో సగం మందిని పూర్తిగా మార్చేందుకు సిద్ధపడు తున్నట్టు వైసీపీ సీనియర్లు చెబుతున్నారు. వీరిని కూడా వచ్చే ఎన్నికల్లో వాడుకునేందుకు పార్టీ కార్యా లయాల్లో వేయడమో.. లేక మీడియాలో కీలక పాత్ర వహించే బాధ్యతలు అప్పగించడమో చేయొచ్చని చెబుతున్నారు.
“మార్పు అయితే.. ఖాయం. ఇప్పుడున్న సలహాదారుల్లో చాలా మందిని మారుస్తారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల కోసం అందరూ పని చేయాలని.. జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు ఉంటారో.. ఎవరు పార్టీ కార్యక్రమాల కోసం వెళ్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది!“ ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.