బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..బాలయ్య హిట్ డైరెక్టర్ మృతి..!!

సినీ ఇండస్ట్రీ శోక శంద్రంలో మునిగిపోయింది. ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాదుతున్నాయి. బడా బడా స్టార్స్ అందరు తిరిగిరాని లోకాలు వెళ్లిపోతున్నారు. ఒకరి మరణ వార్త విని ఆ విషాధ ఛాయలు మరువక ముందే మరో టాప్ సెలబ్రిటీ లు మరణవార్త వినిపిస్తుండడం ..ఇండస్ట్రీలో ప్రముఖులను బాధకలిగిస్తుంది.

సినీ ఇండస్ట్రీని మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం శోకశంద్రంలో మునిగిపోయింది. సన్నిహిత వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం..డైరెక్టర్ శరర్ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస్ విడిచిన్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధి తో బాధపడుతున్న ఆయన అనేక రకాల ట్రీట్ మెంట్ తీసుకుంటున్నప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. డాక్టర్లు చికిత్స చేస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.

డైరెక్టర్ శరత్ తెలుగులో దాదాపు 20 సినిమాలకు ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయాని అందుకున్నాయి. ‘చాద‌స్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ‌ర‌త్ .. బాల‌కృష్ణ కు బ్లాక్ బస్టర్ విజాయాలు అందించాడు . శరత్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటించిన వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, సినిమాలు అమంచి విజయం అందుకున్నాయి. అలాగే సుమన్‌తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, చిన్నల్లుడు వంటి చిత్రాలకు శరత్ దర్శకత్వం వహించారు. దర్శకుడు శరత్ మృతిపట్ల పలువురు సినీ పెద్దలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.