సర్కారు వారి పాటలో మురారి బావ.. అదిరిపోవడం ఖాయం!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే చివరిదశ షూటింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిత్ తీర్చిదిద్దుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సర్కారు వారి పాట చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు శ్రోతలను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా నుండి మూడో పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. థమన్ అందిస్తున్న అద్భుతమైన మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

ఏప్రిల్ 15న ఈ సినిమాలోని మూడో పాట ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ‘మురారి బావా’ అంటూ సాగే ఓ అద్భుతమైన రొమాంటిక్ సాంగ్‌గా ఈ పాట రాబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్, కీర్తి సురేష్‌ల మధ్య ఈ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ చాలా బాగా వచ్చినట్లు చిత్ర యూనిట్ అంటోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మే 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.