మెసేజ్‌లు గట్రా ఉండవు.. అమ్మ తోడు అడ్డంగా నరుకుడే!

మిర్చి సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని, వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కిస్తూ దూకుడు మీద ఉన్న దర్శకుడు కొరటాల శివ. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ మరికొద్ద గంటల్లో మనముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ తన స్టామినా ఏమిటో మరోసారు రుజువు చేసి ఇండస్ట్రీలో ఎప్పటికీ తానే మెగాస్టార్ అని నిరూపించుకోవడం ఖాయమని అంటున్నారు.

అయితే ఈ సినిమా తరువాత కొరటాల తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యయి. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా చేసిన ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాను కొరటాల తనదైన మార్క్ సినిమాల్లా కాకుండా విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ ఖచ్చితంగా ఇస్తాడు. కానీ తారక్ కోసం మాత్రం ఈసారి తన పంథా మార్చుకున్నాడట ఈ డైరెక్టర్. హీరో పాత్రకు ప్రాధాన్యతనిస్తూ, పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించేందుకు కొరటాల రెడీ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ చేసే యాక్షన్ ఇప్పటివరకు ఏ హీరో కూడా చేయని విధంగా ఉండబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంటే.. ఈ సినిమాలో మెసేజ్‌లు లాంటివి ఏమీ లేకుండానే కేవలం యాక్షన్‌కే కొరటాల ఓటేయ్యడంతో ఈ సినిమా ఖచ్చితంగా నందమూరి అభిమానులను అలరించడం ఖాయమని అంటున్నారు సినీ ప్రేక్షకులు.