మొగుడుని వదిలేసి పబ్ కి వెళ్ళడం ఏంటయ్యా..ఏం పెంపకం నీది..నాగబాబు పరువు పాయే..?

గత మూడు రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైన ఉంది అంటే అది కేవలం..డ్రగ్స్ రైడ్ ఇష్యూనే. హైదరాబాద్ లో బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై ఆదివారం తెల్లవారుజామున సడెన్ షాకిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉన్నపలంగా దాడులు నిర్వహించారు. జనరల్ గా అక్కడ ఇలాంటివి కామన్ గానే నడుస్తుంటాయట ..పోలీసులు కూడా చూసి చూడన్నట్లు చూసి వెళ్లిపోతుంటారని టాక్. కానీ, కొత్త గా వచ్చిన వాళ్ళు యమ స్ట్రీక్ట్ కావడంతో తప్పించుకునే స్కోప్ లేకుండా..అడ్డంగా ఇరుక్కుపోయారు..పలువురు బడా స్టార్స్ పిల్లలు.

సమయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు దాడులు చేయగా..పోలీసులకే దిమ్మ తిరిగిపోయేలా అక్కడ సినీ, రాజకీయ బడా సెలబ్రిటీల పిలలు పబ్ లో తాగుతూ తూళుతూ.. పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నట్లు తేలిందట. దీంతో షాకైన పోలీసులు ఈ దాడుల్లో పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లిస్ట్ లో మెగాడాటర్ నీహారిక కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, ఈ లిస్ట్ లో బడా బడా ప్రముఖుల పిల్లలు ఉన్నప్పటికి..కేవలం మెగాడాటర్ నీహారికనే అందరు టార్గెట్ చేస్తుండటం గమనార్హం. ఇక ఈ ఇష్యూ పై శ్రీరెడ్డి స్పందించింది.

తాజాగా నీహారిక డ్రగ్స్ ఇష్యూ గురించి మాట్లాడుతూ నాగ బాబుకు గట్టి కౌంటర్లు ఇచ్చింది. మామూలుగా కాదండోయ్..టూ మచ్ గానే ఇచ్చిపడేసింది. పనిలో పని మధ్యలోకి పవన్ కల్యాన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ..వైసిపీ వాల్ళను పొగిడేసింది. శ్రీరెడ్డి మాట్లాడుతూ..” కర్మ ఎవర్నీ వదిలిపెట్టడదని మరోసారి ప్రూవ్ అయ్యింది కదా నాగబాబు. నన్ను మీరు ఎంత ఏడిపించారు..ఒక ఆదదాని అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఛండాలంగా నాపై నిందలు వేసారు. అర్ధరాత్రి లారీలు ఆపుతూ ఏదో చేశేదాని అని తప్పుగా మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది. నీ కూతురు అర్ధరాత్రి అడ్డంగా బుక్కైంది. మీ అమ్మాయి ఏదో పెద్ద వీర మహిళ లా.. మా బాబాయ్‌కి ఓటు వేయండి అంటూ చెప్పిందిగా… అర్ధరాత్రి ఈ వీర మహిళ చేసే తతంగాలు ఇలానే ఉంటాయా?. నేను పబ్‌లకు వెళ్లడం తప్పు అనడం లేదు. వెళ్ళాలి.. కానీ, మరీ మూడు గంటల వరకు అక్కడ ఏం చేస్తుందయ్యా..? అది కూడా పవిత్రమైన ఉగాది పండుగ రోజున. అయిన పండగ పూట భర్తను వదిలేసి..పబ్ కు పోవడం ఏంటయ్య..? ఇదే నీ పెంపకం..? ఓ అనీ మీటింగులు పెట్టి మా వైసీపీ వాళ్లని టార్గెట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడావ్ కదా.. మరి ఇప్పుడు ఏమంటావ్ స్నేక్ బాబు.. మీ వీర మహిళ సంగతి ఏంటి?,,నన్ను బాధపెట్టినదానికి నువ్వు, నీ తమ్ముడు పవన్ కల్యాణ్ అంతకి అంత అనుభవిస్తారంటూ నోటికిపనిచెప్పింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి మాటలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.