అవార్డ్ తీసుకుంటూ ఏడ్చేసిన ఎన్టీఆర్.. నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని సంఘటన..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి అన్న పేరుకి ఓ గౌరవం ఉంది. అలాంటి చెరగని ఓ ముద్రను వేశారు అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామరావు గారు. అప్పటి వరకు సినిమా లు ఓ లెక్క ఆయన ఇండస్ట్రీలోకి వచ్చాక మరో లెక్క అన్నట్లుగా ఉన్నాయి పరిస్ధితులు. ఆయన నటన, డైలాగ్ చెప్పే విధానం, డ్యాన్స్ స్టేప్పులు..ఆ ఎక్స్ ప్రేషన్స్ అబ్బా.. ఒకటి ఏంటి అన్నీ..ఆయన లా మరెవరు చేయరు ..చేయలేరు..చేయబోరు కూడా..అంత మంచి పేరు సంపాదించుకున్నారు ఎన్టీఆర్.

ఇక ఇండస్ట్రీలో నందమూరి నటవారసులు అనగానే మనకు గుర్తు వచ్చేది..బాలయ్య-తారక్. ఇద్దరికి ఇద్దరు ఏ విషయంలో తీసిపోరు.. నటన, యాక్టింగ్,స్టైల్,సినిమాల విషయంలో డెడికేషన్ అబ్బో..సూపర్ అని చెప్పక తప్పదు. ప్రజెంట్ ఇద్దరు కూడా వేరు వేరు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఈ మధ్యనే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న బాలయ్య..ఆ తరువాత గోఫీచంద్, అనీల్ రావిపూడి తో సినిమాలు చేస్తుంటే.. RRR తో హిట్ అందుకున్న తారక్ కొరటాల శివ, ప్రసాంత్ నీల్, బుచ్చి బాబు లతో సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు.

కాగా, రీసెంట్ గా ఓ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది నందమూరి బాలకృష్ణ-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎప్పటికి గుర్తుండిపోయే పిక్. అది 2001 వ సంవత్సరం..ఆ టైంలో గోయర్స్ అవార్డుకు తారక్ సెలక్ట్ అయ్యారు. అయితే, అవార్డు ఇవ్వడానికి వచ్చిన అతిధి.. బాలయ్య బాబు. మనకు తెలిసిందే అప్పటి వరకు నందమూరి ఫ్యామిలీలో కొన్ని భేద అభిప్రాయాలు ఉన్నాయని. కానీ, ఆ టైంలో బాలయ్య అవార్డు ఇచ్చి..తారక్ భుజం పై చెయ్యి వేయగానే..అక్కడున్న ఫ్యాన్స్ విజిల్స్ కి స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఎన్ టీఆర్ సైతం ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశారు. అనంతరం ఇద్దరికి ఒక్కే పూల మాల వేసి సత్కరించారు. ఆ క్షణం నందమూరి అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు.. అంత ప్రత్యేకం. ఇక అప్పటి నుండి కూడా తారక్-బాలయ్య కలిసి నటిస్తే చూడాలని అభిమానుల కోరిక..మరి వీళ్లద్దరిని కలిపే దమ్మున్న డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో..ఎప్పుడు సినిమా తీస్తాడో వేచి చూడాలి..!!