రోజమ్మ ఓకే..మరీ నీ సంగతేంటి పవను..?

ప్రస్తుతం ఏపీలో సినీ పాలిటిక్స్ మహా రంజు మీద ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ-వైసీపీ ల మధ్య పరిస్ధితులు ఎలా ఉన్నయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉప్పు-నిప్పు లా చిట్ పట్ మంటూ ఉండేవి..ఇప్పుడు మధ్యలోకి పవన్ ఎంట్రీ ఇవ్వడంతో టోటల్ సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ నాయకులు శత్రువులను పంచుకుంటూ..టీం A జనసేన వైపు మళ్ళీ దండ యాత్ర చేస్తుంటే.. టీం B మాత్రం చంద్రబాబు ని ఇంకా డౌన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇవన్నీ ఎలా ఉన్నా.. ఇప్పుడు జగన్ తీసుకున్న నిరణయం వల్ల.. పవను కు పెద్ద చిక్కే వచ్చిన్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కి మంత్రి పదవి ఇచ్చారు తన అన్న జగనన్నా. దీంతో రోజమ్మ హ్యాపీ.. ఆమెను అభిమానించే వారు హ్యాపీ.. కానీ రోజమ్మ.మంత్రి పదవి చేతికి రాగానే సినిమాలకి షూటింగ్ లకి గుడ్ బై చెప్పడం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఆమె మీదే పూర్తిగా ఆధారపడిన జబర్ధస్థ్ కామెడీ షో ఏమైపోతాదో అని కొందరు అంటుంటే.. వైసీపీ భజన బ్యాచ్..పవన్ పై పడి ఏడుస్తుంది.

మా రోజమ్మ చూడు అవకాశాలు ఉన్నా సినిమాలు చేయకుండా పూర్తిగా రాజకీయం వైపే అడుగులు వేస్తుంది.. ఆమెను చూసి నేర్చుకో పవన్ అంటూ మరోసారి జనసేనాని టార్గెట్ చేశారు. అంతేనా ఓ మెట్టు పై కి ఎక్కి..దమ్ముంటే నువ్వు సినిమాలు ఆపేసి..అసలైన రాజకీయం చెయ్యి అంటూ సవాలు విసురుతున్నారు. దీనికి జనసేనా ఫ్యాన్స్ కూడా రీవర్స్ కౌంటర్లు ఇస్తునారు..అయినా కానీ చాలా మంది రోజా చేసింది కరెక్ట్ అంటూ మెచ్చుకుంటున్నారు. ప్రజా సేవ చేయాలంటే..ఖచ్చితంగా కమిట్ మెంట్ ఉండాలి..వేరే పనులు ఉండకూడదు..అసలైన రాజకీయ నాయకులకు ఉండాల్సిన క్వాలిటీ అదే..అంటూ పొగొడేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో పవన్ ను బాగా ఇబ్బంది పెడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూడాలి..పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?