టైగర్ కోసం ఏకంగా ఏడు కోట్ల సెట్..?

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ హీరో ఇటీవల ‘ఖిలాడి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. కాగా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రాక్షసుడు అనే సినిమాలను లైన్‌లో పెట్టాడు.

కాగా ఈ సినిమాలతో పాటు రీసెంట్‌గా ‘టైగర్ నాగేశ్వర్ రావు’ అనే పీరియాడికల్ బయోపిక్ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు మాస్ రాజా. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమాలోని తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఓ భారీ సెట్‌ను చిత్ర యూనిట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

శంషాబాద్ సమీపంలోని ఓ స్థలంలో ఏకంగా రూ.7 కోట్ల మేర ఖర్చుతో ఈ భారీ సెట్ వేస్తున్నారట చిత్ర యూనిట్. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల పర్యవేక్షణలో ఈ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారట చిత్ర యూనిట్. ఇక దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ జీవీ.ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.