జబర్దస్త్‌లో జరిగేది ఇదే.. అసలు విషయం చెప్పేసిన అప్పారావు!

జబర్దస్త్ కామెడీ షో.. పరిచయం అక్కర్లేని షోగా ఇది మనందరికీ తెలిసిందే. ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్, గతకొన్నేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తూ వస్తోంది. ఈ కామెడీ షోలో చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొందరు ఇప్పటికీ జబర్దస్త్‌నే నమ్ముకుని అందులో చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం పేరు, ప్రఖ్యాతలు రావడంతో ఇతర షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కానీ జబర్దస్త్ తెరపై కనిపించేదానికంటే, తెరవెనకాల జరిగే బాగోతం చాలానే ఉంటుంది. పలువురు కమెడియన్లు జబర్దస్త్ షో గురించి కొన్ని సంచలన నిజాలను పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు.

అయితే తాజాగా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిన మరో కమెడియన్ అప్పారావు కూడా జబర్దస్త్‌కు సంబంధించి కొన్ని షాకింగ్ నిజాలు చెప్పుకొచ్చాడు. తనకు ఫేం రావడానికి వందశాతం జబర్దస్త్ కామెడీ షోనే కారణమని చెప్పుకొచ్చాడు ఈ కమెడియన్. అయితే జబర్దస్త్ లాంటి కామెడీ షోకు ఉన్న ఆదరణను చూసి, ఇలాంటి షో నుండి ఎవరూ బయటకు వెళ్లాలని అనుకోరు. తాను కూడా అలాగే అనుకున్నానని.. కానీ కరోనా సమయంలో తనను జబర్దస్త్ కామెడీ షో నిర్వాహకులు పక్కనబెట్టేశారని చెప్పుకొచ్చాడు.

తాను బుల్లెట్ భాస్కర్‌తో కలిసి చేసినప్పుడు, భాస్కర్ తనకు అన్ని విధాలుగా సహాయం చేశాడని.. అయితే భాస్కర్‌కు ఆర్టిస్టులను బాగా వాడుకోవడం తెలుసని.. తమలోని ట్యాలెంట్‌ను బయటకు తీయడంలో భాస్కర్ దిట్ట అని అప్పారావు అన్నాడు. కానీ కరోనా సమయంలో తనను భాస్కర్ పట్టించుకోకపోవడం, తనకు బాధ కలిగించిందని.. భాస్కర్ తన స్థానంలో వేరే ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వడంతో, ప్రస్తుతం ఫైమ లాంటి వారు స్టార్స్‌గా మారారని.. అయినా తనకు ఎలాంటి బాధ లేదని.. అవకాశం ఉన్నప్పుడా దాన్ని వాడుకోవాలని అప్పారావు అన్నారు.

తనను జబర్దస్త్ పక్కనబెట్టినంత మాత్రానా తానేమీ కుమిలిపోలేదని.. తనకు ఇతర కామెడీ షోలు, సినిమా ఛాన్సులు, ఈవెంట్స్ వస్తున్నాయని.. తను ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నానని అప్పారావు అన్నారు. ఇలా జబర్దస్త్ షో తెరపై నవ్వులు పూయించే కమెడియన్లు, తెరవెనకాల ఎంతటి కష్టాలను అనుభవిస్తారో అప్పారావు మరోసారి ప్రూవ్ చేశాడు.