కొత్త వ్యక్తి తో కొత్త ప్రయాణం..సమంత సెన్సేషనల్ డేసిషన్..?

సమంత..టాలీవుడ్ కుందనపు బొమ్మ. చూడటానికి చక్కటి రూపం..చూడగానే ఆకట్టుకునే అందం..ఆ ఫేస్ మొత్తనికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే స్మైల్.. అంతకన్నా గొప్ప మనసు. సమంత పేరు చెప్పగానే ముఖ్యంగా మనకు ఇవే గుర్తు వస్తాయి. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని..టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ప్లేస్ దక్కించుకుంది. ఒకానోక టైంలో సమంతకు క్షణం కూడా తీరకలేకుండా ఉండేలా ఆఫర్స్ వచ్చాయట. అంత పాపులారిటి దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక అదే ఊపులో ఇష్టపడిన టాలీవుడ్ బడా ఫ్యామిలీ హీరో అక్కినేని నాగచైతన్యను గోవాలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని..స్టార్ కొడలుగా స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. అక్కినేని ఇండి కోడలు పిల్ల అంటూ ప్రత్యేకమైన గౌరవాని అందుకుంది. కానీ ఏం లాభం పట్టుమంటే పదేళ్లు కూడా కాపురం చేయకుండా..మొగుడితో విడాకులు తీసుకొవడానికి సిద్ధపడ్డింది. వీళ్లు విడిపోవడానికి రీజన్ ఏంటో ఇంకా తెలియలేదు. వాళ్లు బయటపెట్టకపోవడంతో ..ఎవ్వరికి వాళ్ళు ఇష్టం వచ్చిన్నట్లు ఊహించుకుంటున్నారు. కానీ, వీళ్ళు మాత్రం మా దారులు వేరే అంటూ ఎవ్వరిపని వాళ్లు చూసుకుంటున్నారు.

విడాకుల తరువాత సమంత అక్కినేని ఫ్యామిలీకి వీలైనంత దూరంగా ఉంటుంది. ఇక ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో శాస్వతంగా దూరమైపోనున్నట్లు తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత హైదరబాద్ ను వదిలి పూర్తిగా ముంబైలోనే ఉండిపోవాలని డిసైడ్ అయ్యి..అక్కడే ఒక్క ఇళ్ళు కొనుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, సమంత తన మేనేజర్ ని కూడా మార్చిందట. ఇంత కాలం చైతన్యకి, సమంతకి ఒక్కే మేనేజర్ ఉండేవారట. కానీ విడాకుల తరువాత నుండి సమంత ఆ మేనేజర్ ను పూర్తి గా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గానే అతనితో ఉన్న అగ్రిమెంట్ ను సైతం క్యాన్సిల్ చేసుకుని..కొత్త మేనేజర్ ని పెట్టుకున్నట్లు సమాచారం. ఆ కొత్త వ్యక్తితోనే ముంబైలో కోత్తగా ప్రయాణం మొదలుపెట్టబోతుంది సమంత అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సామ్ పూర్తిగా ముంబై కి షిఫ్ట్ అవుతుండటంతో అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు..కొందరు అయితే ఇక తెలుగు సినిమాలు చేయదు ఏమో అంటూ కంగారుపడుతున్నారు.