యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని రిలీజ్కు ముందర ఆడియెన్స్ ఎంతో ఆతృతగా చూశారు.
అయితే ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో మ్యాటర్ లేదని సినిమా రిలీజ్ రోజున మొదటి ఆటకే కనిపెట్టారు కామన్ ఆడియెన్స్. దీంతో ఈ సినిమా గురించి గొప్పలు చెబుతూ వచ్చిన చిత్ర యూనిట్కు వారి దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ సినిమా చాలా స్లోగా ఉందని, అసలు ప్రభాస్ లాంటి స్టార్ హీరో తీయాల్సిన సినిమా కాదని వారు కుండబద్దలుకొట్టారు. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ రావడంతో మిగతా ఆడియెన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదు.
కాగా టాలీవుడ్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే వసూళ్లను రాబట్టింది. కానీ బాహుబలి, సాహో వంటి సినిమాలతో బాలీవుడ్లోనూ మంచి ఫాలోయింగ్ను క్రియేట్ చేసుకున్న ఈ హీరోకు రాధేశ్యామ్ అక్కడ గట్టి దెబ్బ వేసిందని చెప్పాలి. బాలీవుడ్ జనాలకు ఈ సినిమా ఏమాత్రం నచ్చకపోవడంతో ఈ సినిమాను వారు పూర్తిగా రిజెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ట్రోలర్స్ రోజుకో అంశంపై సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారు.
ఏదేమైనా సినిమా ఫెయిల్ అయితే ఈ రేంజ్లో నెగెటివిటీని మూటగట్టుకోవడం రాధేశ్యామ్కే సొంతం అని చెప్పాలి. అందుకే సినిమా ఔట్పుట్ చేశాకైనా చిత్ర దర్శకనిర్మాతలు సినిమాపై ఇంతలా హైప్ తీసుకొచ్చి, తీరా సినిమా థియేటర్లలో పడ్డాక అందులో ఏం లేదని తేలితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో రాధేశ్యామ్ చిత్రంతో అందరికీ అర్థమైంది.