బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో లాకప్. ఈ షోలో కంటెస్టెంట్లు చెపుతోన్న సీక్రెట్లు వింటుంటే మతిపోతోంది. ఒక్కొక్కరు ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడం కోసం ఇప్పటి వరకు తమ మనస్సులోనే దాచుకున్న సీక్రెట్లను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. తాజాగా తెహ్సీన్ పూనావాలా ఓ షాకింగ్ రహస్యాన్ని వెల్లడించినప్పటికీ అతడు షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
ఇంతకు పూనావాలా బయట పెట్టిన సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతాం. ఇండియాలోనే ఓ టాప్ వ్యాపారవేత్త అతడి భార్యతో పడుకుని.. ఆమెకు సుఖం ఇవ్వాలని మనోడికి ఆఫర్ ఇచ్చాడట. అంతేకాకుండా శని, ఆదివారాల కోసం మా ఇద్దరి కోసం నైట్ క్లబ్ కూడా బుక్ చేశాడు. అతడి భార్యతో తాను బెడ్ షేర్ చేసుకుంటుంటే అతడు చూసి ఎంజాయ్ చేయాలని అనుకున్నాడని పూనావాలా చెప్పాడు.
అతడి కోరికలో కూడా తప్పేం లేదని.. అయితే ఆ కోరికను మేం నెరవేర్చామని చెప్పాడు. ఇక ఈ సీక్రెట్ నీ భార్యకు తెలుసా ? అని కంగనా ప్రశ్నించగా.. తెలుసి.. పెళ్లికి ముందే తాము డేటింగ్లో ఉన్నప్పుడే ఈ విషయాన్ని తాను ఆమెకు చెప్పానని పూనావాలా చెప్పాడు. ఆ తర్వాత లాకప్ షోలోని మరో కంటెస్టెంట్ సాయేషా సైతం ఒక రహస్యాన్ని బయపెట్టాలనడంతో ఆమె పదేళ్ల వయసులోనే అత్యాచారానికి గురయ్యానని బాంబు పేల్చింది.
లాకప్ కంటెస్టెంట్, క్రికెటర్ శివమ్ శర్మ తన గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. తన తల్లి స్నేహితురాలితో బెడ్ షేర్ చేసుకున్నట్లు తెలిపాడు. విడాకులు తీసుకున్న మా అమ్మ స్నేహితురాలు టైం పాస్ కోసం వెళ్లి ఆమెతో బెడ్ షేర్ చేసుకున్నానని బాంబు పేల్చాడు. ఇది నా కాలేజ్ రోజుల్లో జరిగిందని అన్నాడు. అయితే ఇది ఇద్దరి ప్రమేయంతోనే జరిగిందని కూడా చెప్పాడు.