షాక్ శ్రీయ భ‌ర్త‌కు ఏమైంది.. అపోలోలో చేరారెందుకు….!

సోష‌ల్ మీడియాలో సెలబ్రిటీ జంటలు చేసే హంగామాకు కొదవ లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని సెల‌బ్రిటీలు త‌మ ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు పోస్ట్ చేసుకుంటూ ఎప్పుడూ తాము లైమ్‌లైట్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మిగిలిన సెల‌బ్రిటీల‌కు కాస్తంత భిన్నంగా ఉంటారు సీనియ‌ర్ హీరోయిన్‌, ముదురు ముద్దుగుమ్మ శ్రీయ‌.

అప్పుడెప్పుడో ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్లో 20 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఇష్టం సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన శ్రీయ ప‌దేళ్ల పాటు తెలుగు సినిమాను ఓ ఊపు ఊపేసింది. తెలుగులో ఆమె అంద‌రు స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డంలోనూ ఆమె స్టార్ హీరోల‌తో చేసి హిట్ సినిమాలు ఇచ్చింది. శ్రీయ ఎప్పుడూ చాలా రొమాంటిక్‌గా ఉండేందుకే ఇష్ట‌ప‌డుతూ ఉంటుంది.

శ్రీయ రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ ఆండ్రూ కొశ్చివ్ ను ప్రేమించి.. పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారు ఎంత రొమాంటిక్‌గా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటారో శ్రీయ సోష‌ల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు, వీడియోలే చెపుతాయి. తాజాగా శ్రీయ త‌న భ‌ర్త ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోన్న వీడియో షేర్ చేసింది. త‌న భ‌ర్త ఆండ్రూ కొంత కాలంగా హెర్నియాతో బాధ‌పుతున్నాడ‌ని.. ఆయ‌న్ను అపోలో హాస్ప‌ట‌ల్లో జాయిన్ చేశాన‌ని చెప్పింది.

ఇక ఇప్పుడిప్పుడే ఆండ్రూ కోలుకుంటున్నాడ‌ని చెప్పిన శ్రీయ అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి.. ఉపాసనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. శ్రీయ కామెంట్ స్పందించిన చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కూడా అంతా మంచే జ‌రుగుతుంద‌ని చెప్పింది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న త‌న భ‌ర్త త‌న కుమార్తెను కూడా ఎత్తుకోలేని స్థితిలో ఉన్నాడ‌ని.. ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యాడంటూ తన భర్త ఆండ్రూ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది.