అందరూ వెయిట్ చేస్తున్న త్రిబుల్ ఆర్.. మొదటి రివ్యూ వచ్చేసింది?

ప్రస్తుతం భారతదేశం మొత్తం ఒక సినిమా గురించి చర్చ జరుగుతుంది. అదే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా గురించి. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడం.. ఇక ఈ సినిమాలో ఒకరు కాదు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు నటించడం.. అంతకుమించినా విషయం ఏమిటంటే ఇక ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఏకంగా స్వాతంత్ర సమరయోధుల పాత్రలో నటించడం తో ఇక ఈ సినిమా పై పెరుగుతున్న అంచనాలూ మాటల్లో చెప్పలేనివి అని చెప్పాలి. ఈ సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.

రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రతి సినిమాలో కూడా ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ ఉండబోతుందో అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలతో పాటు భారీ తారాగణం కూడా ఉండటంతో పాటు అటు బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతుంది. ఓలివియా మోరీస్ కూడా మరొక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ పనిలో బిజీబిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అటు త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ కు సంబంధించిన వీడియోలు కనిపిస్తూ ఉండటం గమనార్హం.


త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా రివ్యూ ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేశారు. ఒక ఇండియన్ ఫిలిం మేకర్ ఇంత పెద్ద కల కని, ధైర్యం చేసి దాన్ని నిజం చేశారు అని మీకు త్రిబుల్ ఆర్ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా మిస్ అవకుండా చూడాల్సిన సినిమా. ఇది బాక్సా ఫీస్ బ్లాక్బస్టర్ అనిటమే భవిష్యత్తులో ఇదే ఒక క్లాసిక్ గుర్తింపు పొందుతుంది. ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. త్రిబుల్ ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర ఒక సర్ప్రైజ్ ప్యాకేజీ అంటూ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు రాసుకొచ్చాడు.