సర్కారు వారి పాటలో బాలయ్య.. నిజమేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రంలో మహేష్ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్‌డేట్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్, కళావతి, పెన్నీ సాంగ్స్ అభిమానుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా నుండి మరిన్ని అప్‌డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఈ సినిమా రిలీజ్‌కు కావాల్సిన అన్ని పనులను జెట్ స్పీడ్‌లో చేసేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ గురించి అప్పుడే చిత్ర యూనిట్ ఎవరిని గెస్ట్‌గా పిలవాలో కూడా ఫిక్స్ చేసుకుందట.

చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణను ముఖ్య అతిథిగా పిలవాలని మహేష్ కోరాడట. ఇటీవల బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో మహేష్ గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, బాలయ్యతో తన సినిమాను ప్రమోట్ చేయిస్తే, జనాల్లోకి మరింత వెళ్తుందని మహేష్ అనుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బాలయ్యనే గెస్ట్‌గా పిలవాలని మహేష్ ప్లాన్ చేశాడట. ఇక ఔట్ అండ్ ఔట్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాన మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి నిజంగానే ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య గెస్ట్‌గా వస్తాడా అనేది చూడాలి.