నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ జోష్లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత క్రాక్ లాంటి హిట్తో ఫామ్లో ఉన్న గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. ఈ లోపే వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు బాలయ్య. ఇదిలా ఉండగానే వరుస పెట్టి పలువురు డైరెక్టర్ల కథలు బాలయ్య వింటున్నారు.
ఇవన్నీ ఓకే అవుతాయో ? లేదో తర్వాత సంగతి కాని… వరుస పెట్టి ప్లాప్ డైరెక్టర్ల కథలు బాలయ్య వింటున్నారన్న వార్తలు మాత్రం బాలయ్య అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మ్యాచో స్టార్ గోపీచంద్ తో వాంటెడ్` (2011), ` సాయితేజ్ తో జవాన్` (2017) చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి రీసెంట్ గా బాలయ్యకి ఓ స్టోరీ చెప్పారట. ఇది బాలయ్యకు నచ్చిందని.. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారన్న టాక్ బయటకు వచ్చింది.
దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్న రవితో బాలయ్య సినిమా ఏంటన్న సందేహం ఆయన అభిమానులను వెంటాడుతోంది. ఇక మరో ఇద్దరు ప్లాప్ డైరెక్టర్లతో బాలయ్య పని చేయబోతున్నాడన్న వార్తలు వచ్చాయి. సితార వాళ్లు బాలయ్యకు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. సంపత్ నంది ఈ సినిమాకు డైరెక్టర్ అంటున్నారు. సంపత్ నందికి సరైన సక్సెస్లు లేవు.
ఇక తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని అంటున్నారు. తేజను ఎప్పుడూ నమ్మలేం. ఇక దర్శకుడు బాబి పేరు కూడా బాలయ్య లైనఫ్లో ఉంది. బాబి ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేస్తాడు. అవి గొప్ప హిట్లు కావు. బాబి టేకింగ్ను చూస్తే బాలయ్యను డీల్ చేస్తాడన్న నమ్మకాలు ఎవ్వరికి ఉండవు. అందుకే ఇప్పుడు ఈ లిస్ట్ చూసి బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.