టైటిల్ చూసి మెగాస్టార్ చిరంజీవిని యాంకర్ మోసం చేయడమేమిటి.. ఇంతకీ ఏ విషయంలో చిరంజీవి మోసపోయాడని.. మోసం చేసిన ఆ యాంకర్ ఎవరని మీరు ఆలోచిస్తున్నారా.. అయితే కాస్త ఆగండి.. ఇదంతా రియల్ లైఫ్లో జరిగింది కాదు.. కేవలం రీల్ లైఫ్లో మాత్రమే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ఫాధర్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్గా ఈ చిత్రం వస్తోంది.
అయితే ఈ సినిమాలో చిరంజీవిని ఓ టాప్ యాంకర్ మోసం చేస్తుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరుని మోసం చేసే పాత్రలో టాప్ యాంకర్ అనసూయ నటిస్తోంది. ఇక ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గాడ్ఫాదర్ చిత్రంలో చిరంజీవి సామాజిక సేవ చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తాడట. అయితే అనసూయకు చిరంజీవి ఓ విషయంలో సాయం చేస్తాడని.. కానీ అది చివరకు ఆయనకే చెడు చేస్తుందని తెలుస్తోంది.
అనసూయ బిడ్డకు చిరంజీవి తండ్రి అని ఆమె కోర్టులో చెప్పడంతో, ఆయన స్నేహితులు చిరుని జైలుపాలు చేస్తారట. అయితే ఇదంతా ఎందుకు జరిగిందనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్. యాంకర్గా తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ, ఇటు వెండితెరపై తన నటనతోనూ మెప్పిస్తోంది.
గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రావడం, అది కూడా ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో అనసూయ ఫుల్ హ్యాపీగా ఉందట. మరి నిజంగానే గాడ్ఫాదర్ చిత్రంలో అనసూయ చిరుని మోసం చేసే పాత్రలో కనిపిస్తుందా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ నయనతార హీరోయిన్గా నటిస్తోంది.