పుష్ప పార్ట్ 2.. ఈ రెండే హైలెట్ అవ్వనున్నాయా?

కరోనా వైరస్ కాలంలో పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు భయపడుతున్న సమయంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్పా విడుదల చేశాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా ఊహించని దానికంటే ఎక్కువగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఇక సినిమా విడుదల చేయాలా వద్దా అని ఆందోళనలో మునిగిపోయిన మిగతా పెద్ద సినిమాల నిర్మాతలలో పుష్ప విజయం ధైర్యాన్ని నింపింది. కేవలం సౌత్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా 100 కోట్ల వసూళ్లు సాధించి సత్తా చాటింది. అయితే మొదట భిన్నమైన టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం వసూళ్లలో మాత్రం దుమ్ము దులిపింది ఈ సినిమా.

పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇదే జోష్ లో ఇక పుష్ప సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశాడు సుకుమార్. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త ఆలస్యం అయింది అని చెప్పాలి. ఇకపోతే పుష్ప పార్ట్2 ఎలా ఉండబోతుంది అన్నదానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు తెరమీదికి వస్తున్నాయి. ఇటీవలే పుష్ప సీక్వెల్ కు సంబంధించి రెండు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారిపోయాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా ఉన్న కేశవ ఇక రెండవ పార్ట్ లో మాత్రం యాంటీ అవుతాడట.

ఇక మరొకవైపు మంగళం సీను భార్యగా నటించిన దాక్షాయిని పాత్ర ఎంతో పవర్ఫుల్గా ఉంటుందట. ఈ క్రమంలోనే పుష్ప పై పగ ప్రతీకారం పెంచుకుని ఇక అతని భార్య శ్రీవల్లి ని చంపేస్తుందట దాక్షాయిని పాత్ర. శ్రీవల్లి చనిపోవడంతో మరో హీరోయిన్ కూడా పుష్ప సీక్వెల్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందట. ఇక ఇలా రెండవ హీరోయిన్ కోసం అటు బాలీవుడ్ నటిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక పుష్ప తీరుతో తెగ హర్ట్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ పాత్ర పుష్పం సీక్వెల్ లో మాత్రం మరింత పవర్ ఫుల్ గా కనిపించబోతుంది అన్నది తెలుస్తుంది.