జ‌గ‌న్‌తో భేటీ… క్లైమాక్స్ షాక్ ఇచ్చిన నాగార్జున‌, ఎన్టీఆర్‌..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీకి ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని ముందు నుంచే వార్త‌లు వ‌చ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఈ రోజు జ‌గ‌న్‌తో భేటీ కావ‌డంతో అంద‌రి దృష్టి అటు వైపే ఉంది. అయితే ఈ భేటీకి వెళ్లాల్సిన వారిలో ఇద్ద‌రు ప్ర‌ముఖులు చివ‌ర్లో ట్విస్ట్ ఇచ్చారు. ప్రధానంగా నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. నాగార్జునకు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరుంది. నాగార్జున త‌ప్ప‌కుండా ఈ స‌మావేశానికి వ‌స్తార‌నే అంద‌రూ అనుకున్నారు.

ఇక సీఎంవోకు వ‌చ్చిన లిస్టులో పేర్లు ఉన్నా కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాగార్జున ఈ భేటీకి హాజ‌రు కావ‌డం లేదు. నాగార్జున వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదని చెబుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరుకాకపోవడానికి వ్యక్తగత కారణాలా ? లేదా రాజ‌కీయ కోణం ఉందా ? అన్న దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక ఎన్టీఆర్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందకపోవడం వల్లనే హాజరు కావడం లేదని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, నిర్మాతలు నిరంజన్ రెడ్డి, నారాయణమూర్తిలు హాజరవుతున్నారు.


Leave a Reply

*