మహేష్ మంజ్రేకర్ ఈ పేరు భారతీయ సినిమా అభిమానులకు సుపరిచితం. బాలీవుడ్లో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన మహేష్ మంజ్రేకర్ ఆ తర్వాత సౌత్లో కూడా పలు భాషల్లో సినిమాలు చేశాడు. తెలుగులో మహేష్ మంజ్రేకర్ అదుర్స్తో పాటు కొన్ని సినిమాల్లో విలన్గా చేశారు. నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అలాంటి నటుడు ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు.
మహేష్ మంజ్రేకర్ కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత, రచయిత కూడా..! మహేష్ మంజ్రేకర్ సమర్పణలో మరాఠిలోనే వరణ్భట్ లోంచా కోన్ నై కొంచా అనే సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమాలో ఇద్దరు 13 ఏళ్ల కుర్రాళ్ల లైఫ్ గురించి చూపించారు. ఆ కుర్రాళ్లు ఇద్దరూ చేసే పనులతో సినిమాను చాలా వరకు బోల్డ్గా చూపించారు. ఈ సన్నివేశాలు చాలా ఎబ్బెట్టుగానే ఉన్నాయి.
ఈ సీన్లు సభ్యసమాజాన్ని నాశనం చేసేలా ఉన్నాయంటూ… మహిళా సంఘాల నాయకులు.. సామాజిక సంఘాల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్లో మహిళలతో ఆ ఇద్దరు పిల్లలు లైంగీక చర్చకు పాల్పడినట్టు చూపించారు. ఇక సినిమాపై మరాఠాలో పలు సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి.
ఈ వివాదం పెద్దది కావడంతో ఈ సినిమా దర్శకుడు మహేష్ మంజ్రేకర్తో పాటు ఈ సినిమా నిర్మాతలు.. ఆ సినిమాలో నటించిన ఇద్దరు పిల్లల తల్లిదండ్రులపై కేసు నమోదు అయ్యింది. క్షత్రియ మరాఠా సేవా సంస్థ కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇక ఇలాంటి లైంగీకపరమైన వివాదంతో ఈ సినిమా మేకర్స్పై ఏకంగా ఫోక్సో కేసు కూడా పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను బహిష్కరించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.