న‌రేష్ పేరుతో భార్య ర‌మ్య ఎన్ని కోట్ల‌కు ముంచేసిందో తెలుసా..!

సీనియ‌ర్ న‌టుడు వీకే న‌రేష్ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి ఇప్పుడు త‌న భర్త పేరు చెప్పుకుని అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డార‌న్న కేసుల‌తో వార్త‌ల్లోకి ఎక్కారు. విజ‌య‌నిర్మ‌ల కుమారుడు, మా మాజీ అధ్య‌క్షుడు అయిన న‌రేష్ – ఏపీ మాజీ మంత్రి ర‌ఘువీరారెడ్డి త‌మ్ముడు కుమార్తె అయిన ర‌మ్య 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఓ కుమారుడు పుట్టాక మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో దూరంగా ఉంటున్నారు. వీరు అధికారికంగా విడాకులు తీసుకోక‌పోయినా.. అన‌ధికారికంగా మాత్రం దూర‌మైపోయారు. ఇక ఇప్పుడు న‌రేష్ మ‌రో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్రా లోకేష్‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే న‌రేష్ ప్ర‌తి నెలా ర‌మ్య మెయింటైన్స్ చెల్లిస్తున్నాడ‌ట‌. ఇక న‌రేష్ ర‌మ్య‌ను పెళ్లి చేసుకున్న‌ప్పుడు అత‌డి వ‌య‌స్సు 54.. అప్పుడు ర‌మ్య వ‌య‌స్సు న‌రేష్ వ‌య‌స్సులో స‌గం.. అస‌లు వీరు పెళ్లి చేసుకోవ‌డం ఏంట‌ని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు కూడా..! ఓ బాబు పుట్టగానే మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వీరు దూరంగా ఉంటున్నారు. ర‌మ్య అయితే న‌రేష్ ఆస్తుల్లో స‌గం వ‌ర‌కు త‌న‌వే అని అప్ప‌ట్లో నానా గ‌గ్గోలు పెట్టింది. ఇప్పుడు అదే న‌రేష్‌తో దిగిన ఫొటోలు, ఆ ఆస్తులు చూపించి భారీ ఎత్తున వ‌డ్డీల‌కు కోట్లాది రూపాయ‌లు వ‌సూలు చేసింద‌ట‌.

ఆమె బాధితుల నుంచి ఓవ‌రాల్‌గా రు 7-8 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు గ‌చ్చిబౌలి పోలీసుల‌కు అందిన ఫిర్యాదు ప్ర‌కారం తెలుస్తోంది. ఓ ఐదుగురు మ‌హిళ‌ల‌ను బాగా న‌మ్మించి వారి వ‌ద్ద నుంచి భారీ మొత్తంలో సొమ్ములు వ‌సూలు చేసింద‌ట‌. అలాగే ఓ కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగి ద‌గ్గ‌ర అధిక వ‌డ్డీకి రు. 45 ల‌క్ష‌లు తీసుకుంది. ఇందుకు గాను ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వ‌డంతో స‌ద‌రు ఉద్యోగి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంక క‌దిలింది అన్న చందంగా ర‌మ్య బాగోతాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.