బుక్ మై షోలో భీమ్లానాయ‌క్ సంచ‌ల‌న రికార్డులు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్
మూవీ భీమ్లా నాయక్. మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీగా ఉన్న ఈ సినిమా గురించే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఒక్క‌టే చ‌ర్చ న‌డుస్తోంది. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుం కోషియ‌మ్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది.

వ‌కీల్‌సాబ్ త‌ర్వాత యేడాది పాటు గ్యాప్ తీసుకుని ప‌వ‌న్ చేస్తోన్న సినిమా కావ‌డం, అటు రానా కూడా ఉండ‌డంతో మ‌ల్టీస్టార‌ర్ మూవీ కావ‌డంతో స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 100 కోట్ల‌కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ప్ర‌ముఖ టిక్కెట్ల బుకింగ్ యాప్ బుక్ మై షోలో కాస్త ఆల‌స్యంగా ఈ సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.

అయినా కూడా ఈ సినిమా టిక్కెట్లు దుమ్ము రేపే రేంజ్‌లో అమ్ముడు పోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఏ తెలుగు సినిమాకు బుక్ కాని విధంగా 3.75 ల‌క్ష‌ల మంది ఈ సినిమా చూసేందుకు బుక్ మై షోలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో ప్ర‌స్తుతానికి ఇది టాలీవుడ్ రికార్డుగా మారింది. సినిమా రిలీస్ నాటికి ఈ జోరు మ‌రింత పెర‌గ‌నుంది.

సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ఫై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాకు సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందించారు.