ఆ ఒక్క పాట.. వాణిశ్రీ ని చిత్ర పరిశ్రమకు దూరం చేసిందట?

చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది. మారిన ట్రెండ్ కు అలవాటు పడటానికి పాత నటులు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది కొత్త ట్రెండ్ కు ఇమడలేక చిత్ర పరిశ్రమకు దూరం అయ్యే వాళ్లు కూడా ఉంటారు. ట్రెండ్ మారడం అంటే సినిమాలోని ప్రతి విషయంలో కూడా మార్పులు వస్తుంది. పాటల నుంచి డాన్స్ ల వరకు.. యాక్టింగ్ నుంచి యాక్షన్ సన్నివేశాల వరకూ అంతా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి ట్రెండ్ లో మార్పు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వాణిశ్రీ సినిమాలు మానేయడానికి కారణం అయింది అన్నది చాలామందికి తెలియదు. ఇంతకీ ఏం జరిగింది అంటారా.. అశ్వనీదత్ దర్శకత్వంలో నందమూరి తారక రాముడు హీరోగా వాణిశ్రీ హీరోయిన్ గా ఎదురులేని మనిషి అనే సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాలో ఒక డ్యూయెట్ షూటింగ్ జరుగుతోంది. కృష్ణా ముకుందా మురారి అనే ఒక పాట. ఇందులో వాణిశ్రీ ఎన్టీఆర్ నీళ్లలో డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే డాన్స్ మాస్టర్ చూపించిన స్టెప్పులతో కాస్త ఇబ్బంది ఫీల్ అయిన వాణిశ్రీ వెంటనే ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి.. అన్నగారు ఆ డాన్స్ మాస్టర్ చూపిస్తున్న స్టెప్పులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. మీరు ఒక్కసారి మార్పులు చేయించరా అని అడిగారట వాణిశ్రీ. దీంతో వెంటనే నేను చేయలేను అని చెప్పారట అన్నగారు. అదేంటి అంటూ వాణిశ్రీ ప్రశ్నించగా.. తప్పో ఒప్పో చెప్పడానికి మనం ఎవరం.. డబ్బులు పెట్టేది వాళ్ళు సినిమా తీసేది వాళ్ళు.. మనం చేయమంటే వేరే వాళ్ళని పెట్టుకుని చేసుకుంటారు. ఏం చేస్తే లాభం వస్తుందని వాళ్లకే ఎక్కువగా తెలుసు. అందుకే నేను వాళ్లకి ఏం చెప్పలేను అని చెప్పారట ఎన్టీఆర్.

అవును కానీ మీరు ఒక్కసారి చెబితే అంటూ మరోసారి రిక్వెస్ట్ చేసేందుకు ప్రయత్నించారట వాణిశ్రీ.. అంతలో ఎన్టీఆర్ అందుకుని.. నేను మహా అయితే ఇంకో ఐదేళ్లు సినిమాల్లో నటిస్తాను.. అందరూ ట్రెండ్ ఫాలో అవ్వాలి అని చెబుతూ ఉంటారు కదా.. ఇక ఇప్పుడు మనం కూడా అదే చేయాలి. నటీనటులందరూ వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కనబెట్టి ట్రెండ్ ఫాలో అవ్వటం బెటర్ అని కాస్త వివరంగా నే చెప్పారట అన్నగారు. ఎన్టీఆర్ మాటలతో ఆలోచనలో పడి పోయిన వాణిశ్రీ ట్రెండ్ ఫాలో అవ్వడం నావల్ల కాదు ఇక మానేయడమే బెటర్ అని అనుకున్నారట. అప్పటి నుంచి సినిమాలు తక్కువగానే చేస్తూ వచ్చారు వాణిశ్రీ. ఒకరకంగా సినిమాలు వాణిశ్రీ మానేయడానికి ఇక ఈ పాటే కారణం అంటూ టాక్ కూడా ఉంది.