నిన్ను చూడాలని భామ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వంశం నుంచి వచ్చిన మరో పవర్ ఫుల్ హీరో. అచ్చం తాత పోలికలతో ఉండే ఈ కుర్రాడు నిన్ను చూడాలని సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా అడుగు పెట్టాడు. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రవీనా రాజ్ పుత్ యాక్ట్ చేసింది. అటు పలువురు సీనియర్ నటీనటులు సైతం ఇందులో పలు కీలక పాత్రలు పోషించారు. కైకాల సత్య నారాయణ, అన్నపూర్ణ, సుధా, సుధాకర్, శివాజీ రాజా, కె.విశ్వనాధ్ ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రవీనా.. ఇప్పుడు అస్సలు గుర్త పట్టలేని విధంగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎక్కడుంది? ఏం చేస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్టీఆర్ తో సినిమా చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. అంతకు ముందే వెంకటేష్ తో కలిసి ఒంటరి పోరాటం అనే సినిమా చేసింది. 2001లో నిన్ను చూడాలనే సినిమా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ సహా ఎక్కడా తను సినిమాలు చేయలేదు. వాస్తవానికి తనకు నిన్ను చూడాలని సినిమా తర్వాత పలు అవకాశాలు వస్తాయి అనుకున్నారు. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో జనాలను ఆకట్టుకోలేదు. పైగా గతంలో ఉన్న పేరు సైతం తగ్గిపోయింది. దీంతో ఆమెకు నటనపై ఇష్టం నెమ్మదిగా తగ్గిపోయింది.

కొంత కాలం పాటు సైలెంట్ గా ఉంది. ఆ తర్వాత కూడా తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో సినిమా పరిశ్రమకు దూరం కావాలి అనుకుంది. అదే సమయంలో ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను రవీనా పెళ్లి చేసుంది. అయితే సినిమా పరిశ్రమకు ఈమె దూరం కావడానికి ఏవేవో బలమైన కారణాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తను ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సరికదా.. మళ్లీ వెండి తెర మీద కనిపించే ప్రయత్నం కూడా చేయలేదు.