శ్రీహరి అకాల మరణం.. ఆ పాత్ర కోసం జగపతిబాబు దగ్గరికి వెళ్తే ఏమన్నారో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో రియల్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు శ్రీహరి. ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆయన జ్ఞాపకాల్లోనే అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇప్పటికీ ఏదైనా సినిమా చూస్తే ఈ పాత్రలో శ్రీహరి గారు నటిస్తే ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఉంటారు ఎంతోమంది అభిమానులు. అంతలా తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు ఆయన. శ్రీహరి అకాల మరణం తర్వాత ఆయనకు రావాల్సిన ఎన్నో పాత్రలు అటు జగపతి బాబు వద్దకు వెళ్లాయ్ అన్న టాక్ కూడా ఉంది.

ఈ క్రమంలోనే సాయిధరమ్తేజ్ హీరోగా రెజీనా కసాండ్రా హీరోయిన్ గా రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పిల్లా నువ్వు లేని జీవితం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు జగపతిబాబు. కానీ ఈ పాత్రలో ముందుగా తీసుకోవాలి అనుకుంది రియల్ స్టార్ శ్రీహరిని. ఈ విషయాన్ని దర్శకుడు ఒక సమయంలో చెప్పుకొచ్చారు. మొదట శ్రీహరి గారికి పాత్ర వినిపించి ఓకే చేసిన తర్వాత ఆయన అకాల మరణం చెందారు. దీంతో పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలని అనుకుంటున్నా సమయంలో జగపతిబాబు ను సంప్రదించగా ఆయన సహృదయంతో ఒప్పుకున్నారూ అంటూ డైరెక్టర్ రవికుమార్ గతంలో తెలిపారు. ఇక ఈ మూవీ సగం షూటింగ్ అయిన తర్వాత నిర్మాత అల్లు అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో మళ్లీ స్టొరీ చేంజ్ చేసుకుని రాసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది సాయి ధరంతేజ్ రెండవ సినిమా అయినప్పటికీ మొదటి సినిమా రేయ్ విడుదల ఆలస్యం కావడంతో ఇక ఇదే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.