జూ ఎన్టీఆర్ భావోద్వేగపూరిత పోస్ట్…అభిమానులలో ఉప్పొంగిన భావోద్వేగం !

తెలుగు నేలపై తెలుగు ప్రజలు ఉన్నంతవరకు ,అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం మహనీయ నటుడు నందమూరి తారక రామారావు గారు ని మర్చిపోవటం జరగదు .తెలుగు భాషని ,తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా చిరస్మరణీయం. అందుకే నేటికీ కూడా తెలుగు నాట రాజకీయ ప్రస్తావన వచ్చిన , తెలుగు సినిమా ప్రస్తావన వచ్చిన మొట్ట మొదటగా స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరునే గుర్తుకొస్తుంది.

రాజకీయాలో ఎన్టీఆర్ వారుసుడిగా , సినీ వారసుడుగా బాలకృష్ణ ఉండగా ,తరువాత తాతయ్య పోలికలనే పుణికిపుచ్చుకుని మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇపుడు తెలుగు సినిమా దగ్గర పెద్ద స్టార్ట్ అయ్యాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి తన తాత దివంగత ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమ కూడా వర్ణించలేనిది. ఎన్నో మార్లు తన తాతయ్య పట్ల ఉన్న ప్రేమని గౌరవాన్ని చెప్పుకొచ్చిన సందర్భాలు కోకొల్లలు.

అలాంటి మహనీయుడు అయినా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ రోజు కావడంతో తెలుగు ప్రజలు తో పాటు తెలుగు దేశం అభిమానులు ,అలాగే సినీ పరిశ్రమతో పాటు సినీ అభిమానులు అయన పేరును గుర్తు చేసుకుంటున్నారు .ఈ రోజు అయన కుటుంబీకులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు .మరి దీనిపై జూ ఎన్టీఆర్ కూడా భావోద్వేగ పోస్ట్ చేశారు . “తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే” మీరే అంటూ ఎన్టీఆర్ చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ పై ఇప్పుడు నందమూరి అభిమానులని మరింత భావోద్వేగపరిచింది.