నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నభా దశ తిరిగినట్టే అని అందరూ భావించారు.
కానీ, అందరి ఊహలకు భిన్నంగా నభా కెరీర్ డల్ అయిపోయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నభా నటేష్ డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, మాస్ట్రో తదితర చిత్రాలు చేసింది. అయితే ఇవేమీ నభాకు కలిసిరాలేదు. పైగా ఈమెకు ఆఫర్లు సైతం భారీగా తగ్గి పోయాయి.
ప్రస్తుతం నభా చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదట. అయితే వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం.. నభా చేతులారా కెరీర్ను పాడు చేసుకుంటుందట. అసలేమైందంటే.. `ఇస్మార్ట్ శంకర్` సినిమా సక్సెస్ తర్వాత ఆమె తన రెమ్యునరేషన్ బాగా పెంచిందట.
ఆపై సరైన హిట్టు పడకపోయినా రెమ్యూనరేషన్ను మాత్రం తగ్గించలేదట. దాంతో సక్సెస్ లేని హీరోయిన్కు ఇంత రెమ్యునరేషన్ ఎందుకు అనే ఆలోచనతోనే దర్శకనిర్మాతలు నభా నటేష్ను దూరం పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.