సీరియల్స్ దెబ్బకు రూ.19 లక్షలు స్వాహా..ఎక్కడంటే..?

ఈ మధ్యకాలంలో సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉంది అంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆడ వాళ్లు సీరియల్ ప్రసారం అవుతున్న టీవీ ముందు కూర్చున్నాను అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా సీరియల్స్ కే పరిమితమవుతూ ఉంటారు. అయితే తాజాగా ఒక కుటుంబం మాత్రం టీవీలో వస్తున్న సీరియల్స్ కి అంకితం అయిపోయి ఇంటిలో దొంగలు పడినా పట్టించుకోకుండా ఏకంగా 19 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు..కాంచీపురం జిల్లాలో గత గురువారం ఈ ఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు మహిళలు గురువారం రాత్రి టీవీ చూస్తున్నారు. తమకు ఎంతో ఇష్టమైన సీరియల్ వస్తుండడంతో టీవీకి అతుక్కుపోయారు. అప్పుడు టైమ్ 11 దాటింది. ఇంట్లో వారిద్దరు తప్ప ఇంకెవరూ లేరు. తమ ఫేవరేట్ సీరియల్ కావడంతో సౌండ్ గట్టిగా పెట్టుకొని టీవీ చూస్తున్నారు. దాదాపు అర్ధరాత్రి కావొస్తున్నా.. మెయిన్ డోర్‌ పెట్టుకోలేదు. అలానే టీవీ సీరియల్‌లో మునిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. మహిళలు మేల్కొనే ఉండడం.. అందులోనూ టీవీ చూస్తుండడంతో.. కాస్త భయపడ్డారు. కానీ వారు టీవీ సీరియల్‌లో లీనమయ్యారని..ఏం జరిగినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరని గ్రహించి.. ధైర్యంగా ఇంట్లోకి వెళ్లారు. దొంగలు ఇంట్లోకి వచ్చారని కూడా తెలియనంతంగా ఆ ఇద్దరు మహిళలు టీవీకి అతుక్కుపోయారు. అప్పటికే ఇంట్లోకి వచ్చిన దొంగలు ముఖాలకు మాస్క్ ధరించి… మహిళను, ఆమె బంధువును కత్తితో బెదిరించారు. అలా వాళ్లు చూస్తుండగానే బీరువాలో ఉన్న నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. మొత్తం రూ.19 లక్షల విలువైన సొత్తను చోరీ చేశారని వారు పోలీసులతో వెల్లడించారు.