టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ బ్లాక్బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో బాలయ్య మార్కెట్ కూడా ఎవరూ ఊహించని విధంగా పెరిగింది. ప్రస్తుతం బాలయ్య మార్కెట్ వంద కోట్ల రేంజ్ లో ఉంది. అఖండ తర్వాత బాలయ్య మలినేని గోపీచంద్ – అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమా కూడా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ పై గత నాలుగు సంవత్సరాలుగా చాలా వార్తలు వస్తున్నాయి.
కరోనా లేకపోయి ఉంటే ఈపాటికే మోక్షజ్ఞ తొలిసినిమా సెట్స్ మీద ఉండేది. కరోనా దెబ్బతో అందరి హీరోల సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తొలి సినిమాను కూడా బాలయ్య పెద్దగా కాన్సంట్రేషన్ చేయలేదు. మరోవైపు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మోక్షజ్ఞ అమెరికాలో నటనలో శిక్షణ పొందుతున్నాడు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా బోయపాటి చుట్టూ తిరుగుతూ ఉండేది.
మోక్షు ఫస్ట్ సినిమా దర్శకుడు బోయపాటే అని గతంలో వార్తలు వచ్చాయి. మనోడి కోసం బోయపాటి అదిరిపోయే లవ్ + యాక్షన్ స్టోరీ రెడీ చేశారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ సినిమా ముచ్చట్లు ఆగిపోయాయి. మధ్యలో పూరీ జగన్నాథ్ కూడా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. బాలయ్య మోక్షజ్ఞ త్వరలో హీరోగా వస్తాడని చెబుతున్నా… ఎప్పుడు అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ తొలి సినిమా దర్శకుల జాబితాలో ఎవరూ ఊహించని దర్శకుడి పేరు వచ్చి చేరింది.
శ్యామ్ సింగ రాయ్ సినిమాతో అదరగొట్టిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తన దగ్గర ఉన్న కథల గురించి చెబుతూ ఓ టైమ్ ట్రావెల్ స్టోఈ కూడా ఉందని చెప్పాడు. అయితే ఇప్పుడు నందమూరి అభిమానులు అయితే అది మోక్షజ్ఞ కోసమే అయ్యి ఉండవచ్చని అంటున్నారు. గతంలో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చే కథతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందన్న లీకులు రావడం.. ఇప్పుడు రాహుల్ కూడా తన దగ్గర ఆ కథ ఉందని చెప్పడంతో కొందరు నెటిజన్లు మోక్షు ఫస్ట్ సినిమా ఛాన్స్ రాహుల్కు కూడా రావచ్చని అంటున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న క్రేజీ హీరో మోక్షు తొలి సినిమాను రాహుల్ హ్యాండిల్ చేయగలడా ? అన్నది కూడా చూడాలి.