వంటలక్క ను దారుణంగా తొక్కేసిన ప్రేక్షకులు..!

బుల్లితెరపై తన హవా కొనసాగిస్తున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ టాప్ లోనే ఉండేది. కాని తాజాగా టిఆర్పి రేటింగ్ విషయంలో ఇప్పుడు పూర్తిగా చివరికి వెళ్లి పోయింది కార్తీకదీపం సీరియల్. అలా ఎందుకు జరిగింది ఇప్పుడు చూద్దాం.

ఈ సీరియల్స్ లో ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క, మౌనిత అనే పేర్లు బాగా వినిపిస్తాయి. ఈ సీరియల్ అంత డాక్టర్ బాబు, వంటలక్క ఎప్పుడు కలుస్తారనే విషయం పైనే కథ సాగుతూ ఉంటుంది. అయితే ఎట్టకేలకు వంటలక్క డాక్టర్ బాబు కలిసిపోయారు. ఇక దాంతో మౌనిత జైలుకు కూడా వెళ్లడం జరిగింది. అక్కడి వరకు సీరియల్ టిఆర్పి రేటింగ్ భారీగానే దూసుకుపోయింది.

కానీ ఆ విలన్ ను బయటికి తీసుకు వచ్చేసి.. ఆమె డాక్టర్ బాబు వల్ల బిడ్డను కనింది అనే సమస్యతో ఎపిసోడ్ లు చాలా ప్రదర్శించడం వల్ల, ప్రేక్షకులు విసిగిపోయి ఈ సీరియల్ ను చూడడం తగ్గించారు అన్నట్లుగా సమాచారం. ఇక దీంతో రేటింగులు కూడా చాలా దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు టాప్-10 టిఆర్పి రేటింగ్ లో స్థానం కూడా దక్కించుకోలేదు అన్నట్లుగా సమాచారం. దీంతో ఇక ఈ సీరియల్ పని అయిపోయింది అన్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి