మాన్సీ శ్రీవాస్తవ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి అంతగా తెలియక పోవచ్చు. హిందీ సీరియల్స్ చూసేవారికి ఈమె బాగా సుపరిచితమే.కుండలి భాగ్య అనే సీరియల్ ద్వారా ఈమె బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇది ఇలా ఉంటే మాన్సీ శ్రీవాస్తవ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రియుడు, ఫుడ్ అండ్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ కపిల్ తేజ్వానీతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతోంది. ఈ మేరకు ఒక వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా లో వినిపిస్తున్న కథనాల ప్రకారం మాన్సీ, కపిల్ కొన్నేళ్ల క్రితం ఓ యాడ్ షూటింగ్లో కలిశారు. కానీ ఆ తర్వాత మాట్లాడుకోలేదు కలుసుకోలేదు.
ఆ ఫై ఏడేళ్ల తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు.అలా 2019లో వీరి ప్రేమాయణం మొదలైంది. తొలిచూపులోనే ప్రేమలో పడలేదని, కొన్నిసార్లు కలిసిన తర్వాతే ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే ప్రేమలో పడ్డారట.వీరి స్నేహం ప్రేమగా మారి, పెళ్లివరకు వచ్చింది.పెళ్లి ఎప్పుడు? ఎక్కడ చేసుకోవాలి? అని ప్లానింగ్ మొదలు పెట్టిన మాన్సీ వచ్చే ఏడాది జనవరిలో అదీ ముంబైలో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉందట.కాగా మాన్సీ