RRR నుంచి.. బిగ్ అప్డేట్.. డైలాగ్ రివీల్‌..!

ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా , డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంనికీ సంబంధించి ఏదో ఒక విషయం ఏదో విధంగా బయటకు వస్తూనే ఉంది. ఇక ఇలా చేయడం వల్ల ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి అంటున్నారు అభిమానులు ప్రేక్షకులు. ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులో ఉంది.

ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 45 సెకన్ల లిప్స్ తో భారీ అంచనాలను పెంచింది. రాజమౌళి తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఛాయిస్ ఫౌండేషన్ కార్యక్రమంలో ఒక డైలాగ్ ను రివీల్‌  చేశారు. ప్రస్తుతం ఆ డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి మాట్లాడుతూ.. శోభు యార్లగడ్డ వల్ల ఛాయిస్ ఫౌండేషన్ సతీష్ పరిచయమయ్యారు. పిల్లల్లో కలిగే అంటే 90 శాతం సమస్యలను పరిష్కారాలున్నాయి. ఛాయిస్ ఫౌండేషన్ పిల్లలకోసం ఎన్నో రోజులుగా కష్టపడుతోంది అని తెలియజేశారు. ఇక అదే వేదికగా ఒక డైలాగ్ ను కూడా రాజమౌళి తెలియజేశాడు.

“యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి.”అది ధర్మయుద్ధం అయితే విజయం తథ్యమని డైలాగ్ చెప్పారు”మరి ఈ సినిమాలో ఈ డైలాగ్ ఎవరు నూట వస్తుందనే విషయం మాత్రం తెలపలేదు. డైలాగ్ ఎవరు నోట వస్తుందో తెలియాలంటే జనవరి 7వ తేదీ వరకు ఆగాలి.