రోడ్డు పక్కన డాబాలో పని చేస్తున్న ప్రముఖ నటుడు.. కారణం..?

బాలీవుడ్ బీటౌన్ వదిలి ఒక నటుడు రోడ్డు పక్కన దాబా లో పనిచేస్తున్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఆయన ఎవరో కాదు ప్రతి నాయకుడిగా నటించిన సంజయ్ మిశ్రా.. బాలీవుడ్ లో ఈయన ప్రతినాయకుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.. ఇకపోతే బీటౌన్ ని వదిలి రోడ్డు పక్కన ఉన్న డాబాలో పని చేయడానికి గల కారణం ఏమిటి అని అడుగగా ఆయన చెప్పిన మాటలు వింటే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోవాల్సిందే.. అయితే ఆ మాటలను సంజయ్ మిశ్రా మాటల్లోనే తెలుసుకుందాం..

సంజయ్ మిశ్రా మాట్లాడుతూ..కొన్ని ఏళ్ల క్రితం నేను చావును చాలా దగ్గరి నుంచి చూశాను. ఆ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. సినిమాలలో తిరిగి ఎట్టి పరిస్థితుల్లో నటించకూడదు అనుకున్నాను. అందుకే బ్రతుకు తెరువు కోసం రోడ్డు పక్కన దాబాలో పనిచేయడం మొదలెట్టాను. అయినప్పటికీ ప్రజలు నన్ను గుర్తు పట్టడం మొదలెట్టారు. అప్పుడు నా కడుపుకు ఇన్ఫెక్షన్ సోకింది. నా ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగాలేదు. నా తండ్రితో కొన్ని రోజులు గడపాలనుకున్నాను. కానీ అకస్మాత్తుగా ఆయన కూడా మరణించారు. ఆయన మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. జీవితం ఒడుదొడుకులతో కూడినదని నాకు అర్థమయింది. దేవుడు సృష్టిని ఆస్వాదిస్తూ నా సమయాన్ని ఎందుకు గడపకూడదనుకున్నాను. కొండలు, పర్వతాలన్నింటిని చూడాలనుకున్నాను ” అని ఆయన చెప్పారు.