రిపబ్లిక్ సినిమా ఓటీటిలో విడుదల.. ఎప్పుడంటే..!

హీరో సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ దేవకట్టా డైరెక్షన్లో వచ్చిన చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా మొదటి రోజు మంచి టాక్ తో నడిచినప్పటికీ, కలెక్షన్ల పరంగా రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 6 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాని zee-5 లో స్ట్రిమ్మింగ్ అవునన్నట్లుగా తెలుస్తోంది. అదికూడా నవంబర్ 26వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా అక్టోబర్-1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక థియేటర్లలో విడుదలై రెండు నెలలు కూడా పక్కనే సినిమా ప్రేక్షకుల ముందుకు బుల్లితెరపై రానుంది. అందుకు సంబంధించి త్వరలో అధికార ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించింది. రమ్యకృష్ణ, జగపతి బాబును ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఏది ఏమైనా సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమా కలిసిరాలేదని చెప్పుకోవచ్చు.