ప్రభాస్ లేటెస్ట్ మూవీ సెట్స్ పైకి.. ఎప్పటి నుంచంటే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ముగించుకొని సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. దీంతో నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా తీస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాను అతి త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ డిసెంబర్ నుంచి బల్క్ డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటిస్తోంది. అలాగే ఒక కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.

ఇప్పటికే నాగ్ అశ్విన్ ప్రభాస్ లేకుండా అమితాబ్ బచ్చన్, ఇతర నటులతో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కంప్లీట్ చేసుకొని, సలార్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ ప్రాజెక్ట్ కే సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో తీస్తున్న 50వ సినిమా కావడంతో దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.