పేకాటరాయుళ్ల కు అడ్డాగా మారిన నాగశౌర్య ఫామ్ హౌస్..!

హీరో నాగ శౌర్య విభిన్నమైన సినిమాలలో నటిస్తే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. ఇక తాజాగా “వరుడు కావలెను” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ తో నడుస్తోంది. అయితే తాజాగా నిన్నటి రోజున ఈ యువహీరో ఫామ్ హౌస్ లో ఒక సంఘటన జరిగింది అది కాస్త వైరల్ గా మారుతోంది.

హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఉండేటువంటి రాజేంద్ర నగర్ పరిధిలోని మంచిరేవుల పేకాట స్థావరాలపై sot దాడులు జరపగా అక్కడ ఫామ్ హౌస్ లో ఆడిస్తున్న టువంటి సుమన్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక హౌస్ ని ఐదు సంవత్సరాల పాటు హీరో నాగ శౌర్య లీజుకు తీసుకున్నట్లుగా సమాచారం. సుకుమార్ అనే వ్యక్తితో పాటు 20 మంది ప్రముఖులు కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇక అంతే కాకుండా 20 కి పైగా కార్ల తో పాటు 6 లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ విషయంపై నాగ శౌర్య ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.