కన్నడ నటుడిని విలన్ గా పరిచయం చేయనున్న బాలయ్య ..!!

ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోల కంటే విలన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా చూపిస్తే కానీ హీరో క్యారెక్టర్ కు మరింత ఎలివేషన్ రావడం లేదు. అందుచేతనే మన సినిమాలలో హీరోలు క్యారెక్టర్ కు దీటుగా విలను తీసుకొస్తున్నారు. ఇక ఇది వరకు పాతవి ల ని రిపీట్ చేసే వాళ్ళు.

 

కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీలో నుంచి నటులను దిగుమతి చేస్తున్నారు. అలా ఇప్పటి వరకు తమిళ మలయాళ నటులను టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే తాజాగా ఇప్పుడు కన్నడ నటుడు తెలుగులో కూడా విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఒక సినిమా లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయిక శృతి హాసన్ నటిస్తోంది.


ఇక ఈ మూవీలో విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ను ఓకే చేసినట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాతో నైనా ఈ విలన్ బాగా పాపులర్ అవుతాడేమో వేచి చూడాల్సిందే. ఇక డైరెక్టర్ గోపీచంద్ కూడా క్రాక్ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మి శరత్ ను కోలీవుడ్ నుంచి తీసుకొచ్చారు.