యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు జక్కన్నతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి తారక్ రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో తెరకెక్కించగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలపై తారక్ అప్పుడే ఫుల్ ఫోకస్ పెట్టాడు.
ఈ క్రమంలో తారక్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో తారక్ కెరీర్లో 30వ చిత్రంగా ఈ సినిమా రానుండటంతో ఈ మూవీపై అప్పుడే జనాల్లో పిచ్చ క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ కాంబోలో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు తారక్ కోసం కొరటాల ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా తరువాత ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తారక్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ కొత్త వార్త వినిపిస్తోంది.
కొరటాలతో చేయబోయే సినిమాను తారక్ ఫిబ్రవరి నెలలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడని, అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టును అక్టోబర్ నెలలో పట్టాలెక్కించేందుకు తారక్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు చిత్రాల్లో కూడా తారక్ అదిరిపోయే మేకోవర్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ రెండు చిత్రాల్లో విభిన్నమైన లుక్స్తో తారక్ ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా తన నెక్ట్స్ చిత్రాలతో ప్రేక్షకులను మరింత అలరించేందుకు తారక్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టడంతో నందమూరి అభిమానులు ఈ రెండు సినిమాలు ఎప్పుడెప్పుడు పూర్తవుతాయా అని ఆశగా చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ ఉగ్రరూపాన్ని ఎప్పుడు చూద్దామా అని వారు ఆతృతగా ఉన్నారు. కాగా తారక్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు అనే గేమ్ షోను హోస్ట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ షోను కూడా తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేలోపు ముగించాలని చూస్తున్నాడు యంగ్ టైగర్.