సమంత సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత, ప్రస్తుతం తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి , ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డి తో కలిసి విహార యాత్రలు, తీర్థ యాత్రలు చేస్తోంది. ఇకపోతే సమంత మంచి మనసు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధ పిల్లలకు అండగా నిలిచింది.
సమంత సంపాదించే డబ్బులో 25% ప్రత్యూష ఫౌండేషన్ కు కేటాయించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ హీరోయిన్ ప్రాణాలను కూడా కాపాడింది. ఆమె ఎవరో కాదు కేరింత సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తేజస్వి మడివాడ. తేజస్వి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది.. ఇక తండ్రి తాగుడుకు బానిస అయ్యారు.. ఇక చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను అనుభవించిన తేజస్వి కాలేజ్ క్యాంపస్ ల, శరణాలయాలలో తల దాచుకుంటూ తన చదువును పూర్తి చేసింది.. ఇక చిన్న చిన్న పాత్రల ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొంతవరకు డబ్బులను సంపాదించుకుంది..
అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసే సమయంలో తేజస్వి కి టీబీ జబ్బు చేసింది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు.. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇక ఈ విషయం తెలుసుకున్న సమంత తేజస్వి ఆపరేషన్ కు అవసరం అయ్యే మొత్తం డబ్బులు చెల్లించి, తేజస్వి ప్రాణాలను కాపాడండి. ఇక ఈ విషయాన్ని తేజస్వి ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలపడం గమనార్హం.