నటుడు, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో అనసూయ `ఫ్లాష్ బ్యాక్` ఏంటా అని ఆలోచిస్తున్నారా..? ఆగండి అక్కడికే వస్తున్నా. ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో డాన్ శ్యాండీ దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం `ఫ్లాష్ బ్యాక్`. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి `గుర్తుకొస్తున్నాయి` అనేది ట్యాగ్ లైన్.
అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథతో రాబోతున్న ఈ మూవీని అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్పై పి. రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో మొట్టమొదట డబ్బింగ్ మొదలు పెట్టింది అనసూయ.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా తెలిపిన మేకర్స్.. సినిమా ఖచ్చితంగా హిట్ అవుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక త్వరలోనే విడుదల తేదీని సైతం ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా, ఈ చిత్రానికి శ్యామ్ సంగీతం అందిస్తుండగా..నందు దుర్లపాటి మాటలు రాశారు.