అనసూయ.. టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఓవైపు బుల్లితెరపై హాట్ యాంకర్గానూ, మరోవైపు వెండితెరపై అద్భుతమైన నటిగానూ దూసుకుపోతున్న అనసూయ.. టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
ప్రస్తుతం ఆమె ఆచార్య, పుష్ప, రంగమార్తాండ, ఖిలాడీతో పాటుగా తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టితో ఓ సినిమా చేస్తుంది. ఇటు బుల్లితెరపై వరుస టీవీ షోలూ చేస్తున్న అను.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట రెచ్చిపోయే అనసూయ.. ఆ సారి మాత్రం సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. లంగా ఓటీ ధరించిన అనసూయ చికట్లో పరువాలు పోతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆకట్టుకుంటున్న అనసూయ తాజా ఫొటోలను ఎవ్వరు చూసినా ఫిదా అవ్వాల్సిందే.