ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వారు మరో సరికొత్త వెబ్ సిరీస్తో రాబోతోంది. అదే `3 రోజెస్`. ఈశా రెబ్బ, పాయల్ రాజ్పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సిరీస్కి ప్రముఖ డైరెక్టర్ మారుతి షో రన్నర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే రవి నంబూరి రాసిన ఈ సిరీస్ను మ్యాగీ డైరెక్ట్ చేశారు.
ఎస్.కె.ఎన్ యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్పి బ్యానర్పై ఈ సిరీస్ను నిర్మిస్తున్నారు. డిజిటల్ మాధ్యమంలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తోన్న తొలి వెబ్ సిరీస్ ఇదే. ఇక నవంబర్ 12న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సిరీస్ టీజర్ను ఆహా వారు విడుదల చేశారు.
రీతూ – జాన్వీ – ఇందు అనే ముగ్గురు స్వతంత్ర భావాలు కలిగిన ఈ జనరేషన్ అమ్మాయిల జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సిరీస్ను రూపొందించారని టీజర్ బట్టీ స్పష్టంగా అర్థం అవుతోంది. ఓటీటీ కంటెంట్ కావడంతో బోల్డ్ సీన్స్ సైతం కాస్త ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఆకట్టుకుంటున్న 3 రోజెస్ టీజర్ సిరీస్పై మంచి అంచనాలను క్రియేట్ చేసింది.