క్యాన్సర్.. సినీ ఇండస్ట్రీలో ఎందరో తారలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే క్యాన్సర్ వచ్చిందని కృంగిపోలేదు. ధీటుగా ఎదుర్కొని దానిపై గెలిచి మళ్లీ తెర ముందుకు వచ్చిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. మరి ఆలస్యమెందుకు ఆ హీరోయిన్లు ఎవరో చూసేయండి.
మమతా మోహన్ దాస్: తెలుగు, తమిళ భాషల్లో నటిగానే కాకుండా సింగర్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మమతా మోహన్ దాస్.. 2010 లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. మొదట భయపడినా ఆ తర్వాత చికిత్స తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి కోలుకుంది. అయితే 2013 ఏప్రిల్లో ఆమెకు క్యాన్సర్ జబ్బు తిరగబెట్టింది. దాంతో తిరిగి వైద్యం చేయించుకుని క్యాన్సరు ముక్తురాలైన మమతా.. ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు చిత్రాల్లో నటిస్తోంది.
షీలా కౌర్: బాలనటిగా తమిళంలో దాదాపు 20 సినిమాల వరకు నటించిన షీలా.. బన్నీ హీరోగా తెరకెక్కిన `పరుగు` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ భామ..ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాడి గెలిచింది.
గౌతమి: సీనియర్ స్టార్ హీరోయిన్ గౌతమి.. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. రెండేళ్ల పోరాటం తర్వాత ఆ మహమ్మారిని పూర్తిగా వదిలించుకున్న గౌతమి.. క్యాన్సర్ వ్యాధితో పోరాడే వారికి తరచూ ప్రేరణ ఇస్తూ ఉంటుంది.
సోనాలి బింద్రే: టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సోనాలి.. మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడి చావు చివరి అంచుల వరకు వెళ్ళింది. అమెరికాలో చికిత్స తీసుకున్న ఈమె మానసిక బలంతో, కుటుంబసభ్యుల ధైర్యంతో క్యాన్సర్ను జయించింది.