సినీ సమస్యలపై పవన్ తో భేటీ అయిన సినీ నిర్మాతలు?

గత కొద్ది రోజులుగా ఆన్లైన్ సినిమా టికెట్స్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతోంది. దీనితో పార్టీలు సినిమా పరిశ్రమ సైతం కలవరపాటుకు గురవుతున్నాయి. ప్రభుత్వం సినిమా టికెట్లు పోర్టల్ ద్వారా అమ్మాలి అనే నిర్ణయానికి సినీప్రముఖుల విన్నపం మేరకు తీసుకుంటున్నాం అంటోంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం దీనిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. పవన్ విమర్శలకు మంత్రులు కౌంటర్ లు ఇస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సినీ నిర్మాతలు తాజాగా కలిశారు.

దిల్ రాజు, డివివి దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసులు తాజాగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై నిర్మాతలు పవన్ తో చర్చించారు. ఆన్లైన్ టికెట్ల వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి తెర దించేందుకు సినిమా నిర్మాతలు రంగంలోకి దిగారు. ఏపీ మంత్రితో చర్చలు జరిపిన సినీ నిర్మాతలు తాజాగా పవన్ ను కలిసి సినీ రంగంలో ఉన్న సమస్యల గురించి చర్చించారు. ఈ మేరకు త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది.