ఎన్టీఆర్ షోలో స‌మంత ఎంత‌ డ‌బ్బు గెలుచుకుందో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ.. మ‌రోవైపు బుల్లితెరపై `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షోని ఎన్టీఆర్‌ ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. తనదైన మాటల తూటాలతో హాట్ సీట్‌లో కూర్చున్న వారికి చెమ‌ట‌లు ప‌ట్టించేస్తున్నాడు. ఇక అప్పుడ‌ప్పుడూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసేందుకు స్టార్ సెల‌బ్రెటీల‌ను సైతం తీసుకొచ్చి.. వారి చేత గేమ్‌ను ఆడిస్తున్నారు.

Jr NTR to start shooting for Evaru Meelo Koteeswarulu soon - Times of India

ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌లు రాగా.. త్వ‌ర‌లోనే స‌మంత‌ను సైతం రంగంలోకి దింపుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌లు నిజ‌మేన‌ని తెలుస్తోంది. ఇటీవ‌లె ఈ స్పెష‌ల్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ సైతం పూర్తి అయింద‌ట‌.

Samantha to Jr NTR, celebs wish fans on Vinayaka Chathurthi - Movies News

మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే..ఈ షోలో స‌మంత మొత్తం రూ.25 లక్షలు వరకు గెలుచుకుందట. 25 లక్షల ప్రశ్న వరకు సామ్ వెళ్లిందంటే తాను ఎలా ఆడిందో మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే సెల‌బ్రెటీలు గెలుచుకున్న డ‌బ్బు ఏదో ఒక స్వ‌చ్ఛంద సంస్థ‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే స‌మంత రూ. 25 ల‌క్ష‌ల‌ను ప్రత్యూష ఫౌండేషన్​కు విరాళంగా అందజేసింద‌ట‌.